
Play all audios:
భువనేశ్వర్: ఒడిశాలో కీట్ (KIIT) విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. న్యాయం కోసం తోటి విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి
కాఠ్మాండూ నుంచి మీడియాతో మాట్లాడారు. ‘‘రామాయణ కాలం నుంచి భారత్-నేపాల్ (India-Nepal)ల మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. దర్యాప్తు జరుగుతున్నంత కాలం నేను ఒడిశాలోనే ఉండటం వీలుకాదు. కానీ నా
కుమార్తెకు భారత్ న్యాయం చేస్తుందని నమ్ముతున్నాను’’ అని అన్నారు. తన బంధువుల ద్వారా భువనేశ్వర్లోని కీట్ విశ్వవిద్యాలయం గురించి ఆ విద్యార్థిని తెలుసుకుంది. దాంతో ఉన్నత విద్య చదివి,
కుటుంబానికి అండగా నిలవాలని బీటెక్లో చేరింది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన గోరఖ్పుర్లోని భారత సరిహద్దుకు 5 కి.మీ. దూరంలో ఉన్న భైరాహవా(నేపాల్) నుంచి వచ్చి, ఇక్కడ విద్యను అభ్యసిస్తోంది. ‘‘తన
సోదరుడికి మంచి భవిష్యత్తును ఇవ్వాలని నా కుమార్తె తపించేది. కానీ ఇలా మధ్యలోనే తాను మాకు దూరమైంది. తన కలలన్నీ కల్లలయ్యాయి. ఆమెకు ఈ పరిస్థితి తీసుకొచ్చినవారికి శిక్ష పడాలి’’ అని డిమాండ్ చేశారు.
ఆమె ఎవరితోను త్వరగా కలవదు కానీ.. తనను వేధించిన వారిపై ఫిర్యాదులు చేసిందని చెప్పారు. విశ్వవిద్యాలయ యాజమాన్యం వేధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారని, వారిపై తగిన చర్యలు తీసుకొని
ఉంటే తన బిడ్డకు ఈ పరిస్థితి వచ్చేదే కాదని వాపోయారు. * Indian student: మా బిడ్డ కోమాలో ఉంది.. ప్లీజ్ వీసా ఇవ్వండి: భారతీయ విద్యార్థిని కుటుంబం ఆవేదన ఫిబ్రవరి 16న ఆమె చనిపోవడానికి రెండు గంటల
ముందు తల్లితో మాట్లాడింది. తన చదువు గురించి చెప్పడమే గాకుండా, ఇంటి విషయాలు అడిగి తెలుసుకుంది. ‘‘అప్పుడు మాకు తన మాటల్లో ఎలాంటి తేడా కనిపించలేదు. కానీ రెండు గంటల తర్వాత తన ఆత్మహత్య వార్త మాకు
అందింది’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ ఘటన తెలిసిన వెంటనే నేపాలీ విద్యార్థుల సంఘం నిరసనలకు దిగింది. దాంతో 500 మంది నేపాలీ విద్యార్థులను హాస్టళ్లు ఖాళీ చేయించారంటూ వార్తలు వచ్చాయి. దాంతో
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నేపాల్ దౌత్య కార్యాలయం తన అధికారులను పంపింది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మృతురాలి తల్లిదండ్రులతో మాట్లాడారు. దర్యాప్తు గురించి భరోసా ఇచ్చారు.
భువనేశ్వర్లోని ‘కీట్’(KIIT) వర్సిటీ యంత్రాంగానికి యూజీసీ మంగళవారం నోటీసు జారీ చేసింది. కీట్లో నేపాల్ విద్యార్థిని ఆత్మహత్య తర్వాత ఇతర విద్యార్థులపై ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది
చేయిచేసుకోవడం, వసతిగృహాలను ఖాళీ చేయించడంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటుచేసిన త్రిసభ్య ఉన్నతస్థాయి సంఘం మంగళవారం కీట్కు చెందిన మరో ఆరుగురు అధికారుల్ని
27న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.