
Play all audios:
(పాతచిత్రం) ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam attack)లో హనీమూన్ కోసం కశ్మీర్కు వెళ్లిన ఉత్తర్ప్రదేశ్కు చెందిన వ్యాపారి శుభమ్ ద్వివేది (Shubham Dwivedi) ప్రాణాలు కోల్పోయిన
విషయం తెలిసిందే. తాజాగా ఆయన కుటుంబం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) త్వరలో తమను కలుస్తానన్నారని పేర్కొన్నారు. మే 30న కాన్పూర్ ఎంపీ రమేష్ అవస్థి కార్యాలయంలో ప్రధాని
తమను కలవనున్నారని శుభమ్ ద్వివేది తండ్రి తెలిపారు. పహల్గాం ఘటనలో ఉగ్రదాడిలో మొదటి తూటా తన భర్త ప్రాణాన్నే బలితీసుకుందని..అందుకు అయనకు అమరవీరుడి హోదాను ఇవ్వాలని శుభమ్ ద్వివేది భార్య
ఇషానాయ్ ద్వివేది (Eshanaay Dwivedi) కొద్ది రోజుల క్రితం ప్రభుత్వాన్ని కోరారు. * పహల్గాం ఉగ్ర దాడికి ముందు పాక్కు మహమ్మద్ హరూన్..! ఆ విషయాన్ని అమె గుర్తు చేస్తూ..తాము హిందువులం కాబట్టే
ఉగ్రవాదులు తన భర్తను కాల్చి చంపారని అన్నారు. అతడి త్యాగాన్ని గుర్తిస్తూ..కేంద్ర ప్రభుత్వం తన భర్తకు అమరవీరుడి హోదాను ఇవ్వాలని ప్రధానిని స్వయంగా కోరుతామని తెలిపారు. ..ఈ గౌరవంతో అతడి మరణానికి
తగిన న్యాయం జరగడమే కాక.. దేశం అందించే అత్యున్నత నివాళి అవుతుందని అన్నారు. ఇందుకు ప్రధాని మోదీ అంగీకరిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్కు చెందిన శుభమ్
ద్వివేదికి.. ఇషానాయ్ ద్వివేది ఫిబ్రవరి 12న వివాహమైంది. వృత్తిరీత్యా బిజీగా ఉండే ద్వివేది.. తన భార్యతో కశ్మీర్కు విహార యాత్ర కోసం వెళ్లారు. వారు బైసరన్ లోయలో సరదాగా విహరిస్తున్న సమయంలో
వారిని చుట్టు ముట్టిన ఉగ్రవాదులు పేరు అడిగి ముందుగా ద్వివేది తలపై కాల్చి చంపినట్లు ఆయన భార్య పేర్కొన్నారు. ఆయనతో పాటు తననీ చంపమని అడిగితే తాము మహిళలను చంపబోమని..ఈ దాడి గురించి వెళ్లి ప్రధాని
మోదీకి చెప్పుకొమ్మని అన్నారని కన్నీటిపర్యంతమయ్యారు. ఆ దాడిలో ద్వివేదితో సహా 26మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.