
Play all audios:
తిరుపతి: తిరుమల క్యూలైన్లలో నినాదాల ఘటనపై తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాశ్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల ఒకటో పోలీసుస్టేషన్లో అడ్వకేట్తో కలిసి ఫిర్యాదు ఇచ్చారు. వైకాపా నాయకుడు
ఉద్దేశపూర్వకంగా భక్తులను రెచ్చగొట్టేలా నినాదాలు చేశాడని.. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నియమ నిబంధనలు ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తితిదే ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే వెంటనే
చర్యలు తీసుకోవాలని కోరారు. చట్ట సవరణ చేయాల్సి వస్తే.. ధర్మకర్తల మండలిలో చర్చిస్తామని పేర్కొన్నారు.