Jee advanced results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

feature-image

Play all audios:

Loading...

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 ఫలితాలు (JEE Advanced 2025 Results) విడుదలయ్యాయి. By Features Desk Updated : 02 Jun 2025 09:17 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 2 min read


ఫలితాల కోసం క్లిక్‌ చేయండి JEE Advanced Results | ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు


నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష ఫలితాలు (JEE Advanced 2025 Results)వచ్చేశాయి. మే 18న జరిగిన ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ కాన్పుర్‌ సోమవారం విడుదల చేసింది. విద్యార్థులు పైన ఇచ్చిన


లింక్‌పై క్లిక్‌ చేసి రోల్‌ నంబర్‌, పుట్టినతేదీ, మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి స్కోర్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ‘అడ్వాన్స్‌డ్‌’లో అభ్యర్థి సాధించిన మార్కులతో పాటు కేటగిరీ ర్యాంక్‌


ఇచ్చారు. (JEE Advanced 2025 Results out) ఫైనల్‌ కీ (పేపర్‌-1) పైనల్‌ కీ (పేపర్‌-2) పెరగనున్న సీట్లు‌! దేశ వ్యాప్తంగా దాదాపు 1.80 లక్షల మంది పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసినట్లు సమాచారం.


వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది ఉంటారని అంచనా. గతేడాది అడ్వాన్స్‌డ్‌లో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్‌ మార్కుల ఆధారంగా మొత్తం 48,248 మందికి జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు


అర్హత కల్పించారు. వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులు. గత విద్యాసంవత్సరం(2024-25) 23 ఐఐటీల్లో 17,760 సీట్లు అందుబాటులో ఉండగా.. మద్రాస్‌ ఐఐటీ సహా పలు ఐఐటీల్లో కొత్త కోర్సులు


ప్రవేశ పెట్టడంతో ఈసారి సీట్లు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. జూన్‌ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా)-2025 కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.  * జాబ్‌


మార్కెట్‌ ట్రెండ్స్‌: 2030 నాటికి ఏ ఉద్యోగాలు పెరుగుతాయ్‌? ఏవి తగ్గుతాయ్‌? ఆరు విడతల్లో జోసా కౌన్సెలింగ్‌ దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక


సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకి ఈసారి ఆరు విడతల జోసా కౌన్సెలింగ్‌ జరగనుంది.  ఐఐటీ కాన్పుర్‌ ఇటీవల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ


(జోసా)-2025 వెబ్‌సైట్లో ఉంచింది. గతేడాది ఐదు రౌండ్లలో కౌన్సెలింగ్‌ జరగ్గా.. ఈసారి ఆరు విడతల్లో నిర్వహించనున్నారు. జూన్‌ 3వ తేదీన రిజిస్ట్రేషన్లు, ఛాయిస్ ఫైలింగ్‌ చేపట్టనుండగా.. జూన్‌ 9, 11


తేదీల్లో  మాక్‌ సీట్‌ అలాట్‌మెంట్‌ 1, 2;  జూన్‌ 12న ఫైనల్‌ ఛాయిస్‌ లాకింగ్‌ జరగనున్నాయి. అనంతరం  ఒకటో విడత జోసా కౌన్సిలింగ్‌: జూన్‌ 14; రెండో విడత: జూన్‌ 21; మూడో విడత: జూన్‌ 28; నాలుగో


విడత: జులై 4 ; ఐదో విడత: జులై 10; ఆరో విడత: జులై 16 తేదీల్లో నిర్వహించనున్నారు. Published : 02 Jun 2025 08:32 IST గమనిక: _ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని


వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి


కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._