Revanth reddy: దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదు: రేవంత్

feature-image

Play all audios:

Loading...

దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. భారత్‌ సైన్యం విజయవంతంగా ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించిందన్నారు. మేడ్చల్‌: దేశ భద్రత విషయంలో రాజకీయాలకు


తావులేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. భారత్‌ సైన్యం విజయవంతంగా ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించిందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆపరేషన్‌ సిందూర్‌కు మద్దతిచ్చినట్లు తెలిపారు. ఏఐసీసీ


ఆదేశం మేరకు మేడ్చల్‌లోని బాచుపల్లిలో కాంగ్రెస్‌ ‘జైహింద్‌ ర్యాలీ’ నిర్వహించింది. వీఎన్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి కేజీఆర్‌ కన్వెన్షన్‌ వరకు సాగిన ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి,


మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. ‘‘ఆపరేషన్‌ సిందూర్‌కు


మద్దతుగా నెక్లెస్‌ రోడ్డులో ర్యాలీ చేశాం. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పాలని మోదీకి మద్దతు తెలిపాం. 4 రోజుల యుద్ధం తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ, యుద్ధం ఆపేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌


ట్రంప్‌ మీడియా ముందుకు వచ్చి యుద్ధం తానే ఆపానని ప్రకటించారు. యుద్ధానికి మద్దతివ్వాలని అఖిలపక్షం నిర్వహించిన ప్రధాని మోదీ.. యుద్ధం ఆపే విషయంలో ఎందుకు చర్చించలేదు. గుండెల్లో ధైర్యం ఉన్న


నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడు. గతంలో ఇందిరాగాంధీ చైనాను మోకాళ్లపై కూర్చోబెట్టారు. గల్వాన్‌ ఘటనలో మన కర్నల్‌ సంతోష్‌ను పొట్టన పెట్టుకుంటే ఏమీ చేయలేకపోయాం. 1971లో అమెరికా అండతో పాకిస్థాన్‌


మనపై యుద్ధానికి వచ్చింది. యుద్ధం ఆపాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు... ఇందిరాగాంధీని బెదిరించారు. కానీ, ఆమె బెదిరింపులకు లొంగలేదు. పాక్‌ను ఓడించి.. ఆ దేశాన్నే రెండు ముక్కలు చేశారు’’ అని


రేవంత్‌ అన్నారు.