
Play all audios:
Karun Nair: ఐపీఎల్ 2025 సీజన్లో డీసీ తొలి ఓటమిని చవిచూసింది. వన్డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ సూపర్ ఇన్నింగ్స్ దిల్లీని కాపాడలేకపోయింది. ఇంటర్నెట్ డెస్క్: కరుణ్ నాయర్ (Karun Nair) ఐపీఎల్
పునరాగమనం ఘనంగా జరిగింది. బ్యాటింగ్పరంగా అద్భుతంగా ఆడాడు. అయితే, తాను ప్రాతినిధ్యం వహించిన దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)కు ఓటమి ఎదురుకావడం నిరాశపరిచిందని కరుణ్ వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్లో ముంబయితో జరిగిన మ్యాచ్లో దిల్లీ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. వన్డౌన్లో వచ్చిన కరుణ్ నాయర్ 40 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అయితే, ఆఖర్లో వరుసగా మూడు రనౌట్లు
కావడంతో దిల్లీ పరాజయం చవిచూసింది. తన ప్రదర్శనపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు కరుణ్ నాయర్ సూపర్ సమాధానం ఇచ్చాడు. * కరుణ్ క్షమాపణలను తిరస్కరించిన బుమ్రా.. రోహిత్ రియాక్షన్ వైరల్! ‘‘నా
ఇన్నింగ్స్పై మాట్లాడటానికి ఏమీ లేదు. ఇప్పుడు పెద్ద ప్రయోజనమూ లేదు. మంచి ఆటతీరే ప్రదర్శించా. కానీ, నా టీమ్ ఓడిపోయింది. కాబట్టి, ఆ ఇన్నింగ్స్కు విలువే లేదు. విజయం సాధించనప్పుడు ఎంత గొప్ప
ఇన్నింగ్స్ అయినా వాల్యూ ఉండదు. ఈ సీజన్కు ముందు నేను ఐపీఎల్లో ఆడతాననే నమ్మకంతోనే ఉన్నా. ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకొనేందుకు సిద్ధంగానే ఉన్నా. మనసులో మాత్రం క్రీజ్లోకి వెళ్లాక
అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించాలని భావించా. ఇన్నింగ్స్ను వేగవంతం చేయడానికి కొన్ని బంతులు తీసుకున్నా. పవర్ ప్లేలో దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. నేను మామూలుగా ఆడే షాట్లనే కొట్టా. నాకు అన్నీ
కలిసొచ్చాయి. నా బ్యాటింగ్ పరంగా సంతోషంగానే ఉన్నా. మా జట్టు విజయం సాధించి ఉంటే ఇంకా బాగుండేది’’ అని కరుణ్ వెల్లడించాడు. ఫాఫ్ లేని లోటు.. ‘‘పవర్ ప్లేలో ఫాఫ్ డుప్లెసిస్ డేంజరస్ బ్యాటర్.
అతడు లేని లోటును పూరించాల్సిన బాధ్యత నాది. బెంచ్పై ఉన్న ఆటగాళ్లంతా తమ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నారని తెలుసు. అందుకే మెంటల్లీ నేను కూడా నా ఛాన్స్ కోసం సిద్ధంగానే ఉన్నా. తుది జట్టు ఎంపిక
ఎప్పుడూ కఠినమే. ఆ విషయంలో మేనేజ్మెంట్ ఏం నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తా. నా సన్నద్ధతను ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉంటా. అవకాశం వచ్చినప్పుడు అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తా’’ అని
వెల్లడించాడు.