
Play all audios:
చార్మినార్ పరిధిలోని గుల్జార్హౌస్లో అగ్నిప్రమాద ఘటనపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్: చార్మినార్ పరిధిలోని గుల్జార్హౌస్లో
అగ్నిప్రమాద ఘటనపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో పలువురు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల
కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డికి మల్లికార్జున ఖర్గే ఫోన్ సీఎం రేవంత్రెడ్డికి (Revanth Reddy) ఏఐసీసీ అధ్యక్షుడు
మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారు. గుల్జార్హౌస్ అగ్నిప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును సీఎం ఆయనకు వివరించారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్లు
తెలిపారు. ఘటనాస్థలికి మంత్రులు వెళ్లినట్లు చెప్పారు. (Telangana News) గుల్జార్హౌస్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులున్నారు. ఆదివారం ఉదయం
భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న కొందరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఉస్మానియా, యశోద (మలక్పేట), డీఆర్డీవో అపోలో ఆసుపత్రులకు తరలించారు. విద్యుదాఘాతం వల్లే భవనంలో
మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.