Rajnath singh: పీవోకే ప్రజలు మనవాళ్లే.. గ్రేట్‌ ఇండియా మా సంకల్పం: రాజ్‌నాథ్‌ సింగ్‌

feature-image

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్: పీవోకే (POK) ప్రజలు మన వాళ్లేనని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడున్న వారికి భారత్‌తో దృఢమైన సంబంధాలున్నాయని అన్నారు. ఈమేరకు


దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘భౌగోళికంగా విడిపోయినా పీవోకే ప్రజలు రాజకీయంగా ఏదో ఒకరోజు భారత్‌లో ఏకమవుతారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. పీవోకే దానంతట అదే తిరిగి వస్తుంది.


అక్కడున్నవారికి భారత్‌తో దృఢమైన సంబంధాలున్నాయి. గ్రేట్ ఇండియా మా సంకల్పం. అక్కడ కొందరు మాత్రమే తప్పుదారి పట్టారు. మనం ఏమైనా చేయగలిగేవాళ్లం. అయితే శక్తితో పాటు సంయమనం కూడా ముఖ్యం.  ఆపరేషన్


సిందూర్ ద్వారా దేశభద్రతకు మేకిన్‌ ఇండియా ముఖ్యమని ప్రూవ్ అయింది. మనం ఇప్పుడు ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలను నిర్మించడంతో పాటు.. కొత్తతరం యద్ధ సాంకేతికతల పైనా దృష్టిపెట్టాం’’ అని మంత్రి


వెల్లడించారు. * ఉగ్రవాద వ్యాప్తికి సహకరించే వారికి సరైన సమాధానం ‘ఆపరేషన్‌ సిందూర్‌’: మోదీ ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉపయోగించిన దేశీయంగా అభివృద్ధి చెందిన వ్యవస్థలు ప్రపంచం మొత్తాన్ని షాక్‌కు


గురిచేశాయి. శత్రుకవచాన్ని దాటుకొని వెళ్లగలమని నిరూపించాం. ఉగ్రస్థావరాలు, తర్వాత శుత్రువుకు చెందిన మిలిటరీ స్థావరాలను ఎలా ధ్వంసం చేశామో మీరు చూశారు. ఇంకా చాలా చేయగలం. బలం, నిగ్రహం మధ్య


సమన్వయాన్ని ప్రపంచానికి చూపాం’’ అని చెప్పారు. ఈసందర్భంగా పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. ఉగ్రవాద వ్యాపారాన్ని నడపడానికి పెద్ద ఖర్చేం కాదు కానీ, దానివల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి


వస్తుందన్నారు. అదే ఇప్పుడు పాక్‌కు అర్థమైందన్నారు.  పాకిస్థాన్‌ ఎన్నోఏళ్లుగా పెంచి.. పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో తుడిచిపెట్టేసిందని ఇటీవల రాజ్‌నాథ్‌ సింగ్‌


(Rajnath Singh) పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాక్‌ చర్యలను భారత్‌ పరిశీలిస్తుందని.. తేడా వస్తే మరింత కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఆపరేషన్ సిందూర్‌పై ఈ రోజు ప్రధాని మోదీ కూడా


మాట్లాడారు. భారత్‌లో ఉగ్రవాదం వ్యాప్తి చేసేవారికి సరైన సమాధానం ఈ ఆపరేషన్‌ అని వ్యాఖ్యానించారు. పహల్గాంలో ఉగ్రమూక చేసింది మానవత్వంపై దాడి అని, ఇప్పుడు మనం టెర్రరిజానికి వ్యతిరేకంగా


పోరాడేందుకు ఏకమయ్యామన్నారు.