Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. దేశ ఆత్మగౌరవం, ధైర్యాన్ని పెంచింది: ఆరెస్సెస్‌ చీఫ్‌

feature-image

Play all audios:

Loading...

పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’(Operation Sindoor) విజయవంతంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) స్పందించారు. ఇంటర్‌నెట్‌


డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’(Operation Sindoor) విజయవంతంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) స్పందించారు.


ఉగ్రవాదులను అంతమొందించిన భారత సైనిక దళాలు, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. దేశ భద్రత దృష్ట్యా పాకిస్థాన్‌పై దాడులు అనివార్యమన్నారు. * భారత సైన్యానికి 7.5 లక్షల ట్రక్కులను


అందిస్తాం: ఏఐఎంటీసీ కర్ణాటకలోని బెళగావిలో మోహన్‌ భాగవత్‌ మాట్లాడుతూ.. ‘‘పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య. దానికి వ్యతిరేకంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో పాక్‌కు దీటుగా బదులిచ్చిన


కేంద్ర ప్రభుత్వానికి, సైనిక బలగాలకు నా అభినందనలు తెలుపుతున్నా. పహల్గాం దాడి బాధితులకు న్యాయం చేసేందుకు చేపట్టిన ఈ ఆపరేషన్‌ దేశ ఆత్మగౌరవం, ధైర్యాన్ని పెంచింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మిలిటరీ


బలగాల చర్యలకు పూర్తిగా మద్దతిస్తున్నాం. ప్రస్తుత సమయంలో భారతీయులంతా కలిసికట్టుగా ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్తల వేళ దేశం మొత్తం సైన్యం వెంటే ఉంది’’ అని వ్యాఖ్యానించారు. భారత సరిహద్దుల్లోని


దేవాలయాలు, ఇతర జనావాస ప్రాంతాలపై పాక్‌ సైన్యం చేస్తున్న దాడులను మోహన్ భాగవత్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్రిక్తతల నడుమ దేశ


పౌరులు ప్రభుత్వ సూచనలు, హెచ్చరికలను పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. ఇలాంటి సమయంలోనే దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. జాతీయ భద్రతను కాపాడేందుకు పౌరులంతా


సమష్టిగా కృషి చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.