Himanta biswa sarma: యుద్ధంలో గెలిచినా... అప్పుడు పీవోకేను ఎందుకు వదిలేశారు?

feature-image

Play all audios:

Loading...

పాక్‌తో కాల్పుల విరమణ అంశంపై ప్రధాని మోదీని (PM Modi) ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌ పార్టీకి లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) అన్నారు. హిమంత బిశ్వ శర్మ గువాహటి:


పాక్‌తో కాల్పుల విరమణ అంశంపై ప్రధాని మోదీని (PM Modi) ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌ పార్టీకి లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) అన్నారు. 1971లో పాకిస్థాన్‌తో


(IndoPak War) జరిగిన యుద్ధంలో ఘన విజయం సాధించినా.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను తిరిగి వశపరచుకునేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనకాడిందని ప్రశ్నించారు. ‘చికెన్‌ నెక్‌ ఆఫ్‌


ఇండియా’గా పిలిచే సిలిగుడి కారిడార్‌ను కనీసం 100 మైళ్ల మేర అయినా ఎందుకు విస్తరించలేకపోయారని ప్రశ్నించారు. గువాహటిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు. ఒకవేళ ఇందిరాగాంధీ


బతికి ఉంటే ఇవే ప్రశ్నలు ఆమెనే అడిగేవాడినని అన్నారు. ‘‘ 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత సైన్యం అఖండ విజయం సాధించింది. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి గానీ, ఈశాన్య


రాష్ట్రాలను మిగతా భారతదేశానికి కలిపే ‘చికెన్‌ నెక్‌’ను విస్తరించేందుకుగానీ, అదే సరైన సమయం. ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ అప్పట్లో ఆ పని ఎందుకు చేయలేదు?వివిధ దేశాల సరిహద్దులకు దగ్గరగా ఉండే ఈ


వ్యూహాత్మక ప్రాంతాలను అప్పుడే భారత్ అధీనంలోకి తీసుకోవాల్సింది.’’ అని బిశ్వశర్మ అన్నారు. తాజాగా పాకిస్థాన్‌తో కాల్పుల విరమణపై ఆయన మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారికి తగిన బుద్ధి


చెప్పేందుకు, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌ను పూర్తిగా నాశనం చేసేందుకే  ‘ ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టినట్లు చెప్పారు. ఆ లక్ష్యం పూర్తయిందని, అందుకే పాక్‌తో కాల్పుల విరమణకు భారత్‌


అంగీకరించిందని తెలిపారు. ఉగ్రవాదులకు వత్తాసు పలికిన పాక్‌ సైన్యానికి కూడా భారత్‌ ఆర్మీ తగిన రీతిలో బదులిచ్చిందని పేర్కొన్నారు. భారత్ శక్తి ముందు నిలవలేమని భావించిన పాక్‌ కాళ్ల బేరానికి


వచ్చిందని ఎద్దేవా చేశారు.