
Play all audios:
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మోస్తరు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా మెటల్, రియల్
ఎస్టేట్, టెక్నాలజీ స్టాక్స్ రాణించాయి. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు చల్లారడం, రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడంతో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించొచ్చన్న అంచనాలు ఇందుకు కారణం. నిఫ్టీ
మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒక శాతానికి పైగా లాభడ్డాయి. సెన్సెక్స్ ఉదయం 81,278.49 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,148.22) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్న
సూచీ.. 80,910.03 - 81,691.87 మధ్య కదలాడింది. చివరికి 182.34 పాయింట్ల లాభంతో 81,330.56 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 88.55 పాయింట్ల లాభంతో 24,666.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ
85.27గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఎటర్నల్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, కోటక్
మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 65.77 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3237 డాలర్ల
వద్ద ట్రేడవుతోంది.