
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 18వ సీజన్ వాయిదా పడింది. భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ టోర్నీ నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం
తీసుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్లను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు టోర్నీ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అనేక ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం
చేశాయి. దీనిపై ఐపీఎల్ పాలక మండలిలో చర్చించాం. ప్రసారకర్తలు, స్పాన్సరర్లు, అభిమానుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. మన సాయుధ బలగాల స్థైర్యం, సన్నద్ధతపై మాకు పూర్తి విశ్వాసం
ఉన్నప్పటికీ.. అందరి అభిప్రాయాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నాం.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి బీసీసీఐ పూర్తి మద్దతు ప్రకటిస్తోంది. మన సాయుధ బలగాల ధైర్యం, నిస్వార్థ సేవకు సెల్యూ్ట్
చేస్తున్నాం’’ అని ఐపీఎల్ తమ ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చింది. * భయమేసింది.. బాంబులు పడతాయని అరుపులు: ఛీర్లీడర్ వీడియో వైరల్ ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో టోర్నీని కొంతకాలం
వాయిదా వేసినట్లు బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. ‘‘ఓవైపు దేశం యుద్ధం చేస్తుంటే.. ఇలాంటి సమయంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం సరైంది కాదనిపించింది’’ అని వెల్లడించారు. ఇప్పటికే పంజాబ్, దిల్లీ
మ్యాచ్ భద్రతా కారణాలరీత్యా మధ్యలోనే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ లఖ్నవూ - ఆర్సీబీ మధ్య లఖ్నవూలోని ఏకనా స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉండగా.. నేటి నుంచి నిలిపివేత అమల్లోకి రానుంది.
ప్రస్తుత సీజన్లో ఇంకా 12 లీగ్ మ్యాచులు ఉన్నాయి. రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉంది. షెడ్యూల్ ప్రకారం మే 25న కోల్కతా వేదికగా ఐపీఎల్ ఫైనల్ ఉంది. ప్రస్తుతం
పాయింట్ల పట్టికలో గుజరాత్ (16), బెంగళూరు (16), పంజాబ్ (15), ముంబయి (14) ఉన్నాయి. ఐపీఎల్ ఆటగాళ్ల ‘ప్రత్యేక రైలు’కు అనుమతి లేదా? భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఐపీఎల్ (IPL)
నిరవధికంగా వాయిదా పడింది. ధర్మశాలలో ఉన్న పంజాబ్, దిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లను, సిబ్బందిని అక్కడినుంచి దిల్లీకి తరలించేందుకు తొలుత ప్రత్యేక రైలును బీసీసీఐ ఏర్పాటుచేసింది. వందేభారత్లో
తరలించేందుకు సిద్ధమైంది. అయితే, తాజా కథనాల ప్రకారం.. ఆ రైలు వెళ్లేందుకు రైల్వేశాఖ అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. పఠాన్కోట్ మీదుగా వెళ్లాల్సిన నేపథ్యంలో రిస్క్ తీసుకోదలుచుకోలేదని రైల్వే
వర్గాలు తెలిపాయి. దీంతో మరోవిధంగా ఆటగాళ్లను తరలించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. బస్సుల్లో దిల్లీకి తీసుకెళ్లాలని భావిస్తోంది.