
Play all audios:
Adani Green Energy | ఇంటర్నెట్ డెస్క్: అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ శ్రీలంకలో రెండు పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వైదొలిగింది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా
ప్రకటించింది. శ్రీలంక ప్రభుత్వం కోరుకుంటే భవిష్యత్తులో సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. దేశంలో పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటు, విద్యుత్ పంపిణీకి అదానీ గ్రీన్తో గతంలో
శ్రీలంక ప్రభుత్వం ఒప్పందం చేసకుంది. రెండు పవన విద్యుత్ ప్రాజెక్టుల విలువ 1 బిలియన్ డాలర్లు. గతేడాది మేలో అప్పటి శ్రీలంక ప్రభుత్వం అదానీ సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు యూనిట్కు
0.0826 డాలర్లు చెల్లించేందుకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు.. భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు అదానీ గ్రూప్ లంచాలు ఇవ్వజూపినట్లు ఆరోపణలు
వచ్చాయి. ఈ నిధుల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు ఉండడంతో ఇదే చట్టం కింద అమెరికా సర్కారు విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో కొత్తగా కొలువుదీరిన అనుర కుమార దిసనాయకే నేతృత్వంలోని
ప్రభుత్వం అదానీ గ్రూప్తో గత ఒప్పందాలను రద్దు చేసి, దర్యాప్తునకు ఆదేశించింది. ఆపై ఒప్పందాలను సమీక్షించి, యూనిట్కు 0.06 డాలర్ల కంటే తక్కువ ధరకు విద్యుత్ అందించాలని అదానీ గ్రూప్ను కోరింది.
ఈ డిమాండ్ను అంగీకరించని అదానీ గ్రూప్.. ప్రాజెక్ట్ నుంచి వైదొలిగింది.