
Play all audios:
Published by: Last Updated:February 10, 2024 6:16 PM IST POLITICS: అనంతపురం జిల్లాకు చెందిన దివంగత నేత, టీడీపీ నాయకుడు పరిటాల రవి ఫ్యామిలీ నిన్నటి వరకు జిల్లా రాజకీయాలను శాసించింది. కాని
ఇప్పుడు మాత్రం ఆ ఫ్యామిలీ కోరిన సీట్లు ఇచ్చే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. పరిటాల ఫ్యామిలీ గ్రాఫ్ ఎందుకు తగ్గింది .. ఎవరికి టికెట్ వస్తుంది ..ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఇప్పుడిదే
పరిటాల అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. రాయలసీమలో మసకబారుతున్న పరిటాల ఫ్యామిలీ పొలిటికల్ చరిష్మఒకప్పుడు జిల్లాను శాసించిన పరిటాల ఫ్యామిలీ ఇప్పుడు ఏ స్థానంలో పోటీ చేయాలో కూడా తేలని
పరిస్థితిరాప్తాడు,ధర్మవరం రెండు చోట్ల టికెట్ కావాలని పట్టుఒక సీటు మాత్రమే ఇస్తామంటున్న టీడీపీ అధిష్టానంరాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ప్రస్తుత రాజకీయ
పరిణామాలు చూస్తే అర్ధమవుతుంది. ఒకప్పుడు జిల్లా స్థాయి నేతగా ఉండి ఒక ప్రాంతాన్ని శాసించిన బలమైన నాయకుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే అందరికి సుపరిచితుడిగా పేరు తెచ్చకున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్
రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఆ నాయకుడి చరిష్మాతో దశాబ్ధాల కాలం పాటు రాజకీయంగా ఓ వెలుగు వెలుగుతూ వచ్చింది ఆయన ఫ్యామిలీ. అయితే ఇప్పుడు మాత్రం సీన్ రివర్సైంది. రాజకీయంగా నమ్ముకున్న
పార్టీలో ఆ ఫ్యామిలీకి ప్రాధాన్యత తగ్గింది. అందుకు వ్యక్తిగత కారణాలు కాకపోయినప్పటికి రాజకీయ పొత్తులు, పార్టీ అధిష్టానం నిర్ణయంలో మార్పుల ఫలితమే అంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన దివంగత
నేత, టీడీపీ నాయకుడు పరిటాల రవి(Paritala Ravi) ఫ్యామిలీ నిన్నటి వరకు జిల్లా రాజకీయాలను శాసించింది. కాని ఇప్పుడు మాత్రం ఆ ఫ్యామిలీ కోరిన సీట్లు ఇచ్చే పరిస్థితిలో తెలుగుదేశం(Telugudesam) పార్టీ
లేదు. పరిటాల ఫ్యామిలీ గ్రాఫ్ ఎందుకు తగ్గింది .. రాబోయే ఎన్నికల్లో పరిటాల కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రాధాన్యత దక్కనుంది అనేది ఇప్పుడు పరిటాల రవి అభిమానుల్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్న
అంశం.పరిటాల ఫ్యామిలీ చరిష్మ తగ్గిందా...ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో పరిటాల రవి పేరు తెలియని వారుండరు. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేతగానే కాకుండా ఫ్యాక్షన్ రాజకీయాలు, జిల్లాలో అందరివాడిగా
పేరు తెచ్చుకున్న పరిటాల రవి తన సొంత చరిష్మాతో రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇలాంటి బలమైన నాయకుడు మరణానంతరం ఆయన ఫ్యామిలీ నుంచి పరిటాల సునీతకు రాజకీయంగా
టీడీపీలో సముచిత స్థానం దక్కింది. మంత్రిగా కూడా కొనసాగారు. ఆ తర్వాత పరిటాల వారసుడిగా ఆయన కుమారుడు పరిటాల శ్రీరాం ఎంట్రీతో జిల్లాలో పరిటాల ఫ్యామిలీ ఇంత కాలం చక్రం తిప్పుతూ వచ్చింది. అయితే
ఇప్పుడు మాత్రం జిల్లాలోనే కాదు ..తెలుగుదేశం పార్టీలో కూడా పరిటాల ఫ్యామిలీకి ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు జిల్లాను శాసించిన పరిటాల ఫ్యామిలీ ఇప్పుడు ఏ స్థానంలో పోటీ చేయాలో కూడా తేలని పరిస్థితి
రాప్తాడు,ధర్మవరం రెండు చోట్ల టికెట్ కావాలని పట్టు ఒక సీటు మాత్రమే ఇస్తామంటున్న టీడీపీ అధిష్టానం రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు
చూస్తే అర్ధమవుతుంది. ఒకప్పుడు జిల్లా స్థాయి నేతగా ఉండి ఒక ప్రాంతాన్ని శాసించిన బలమైన నాయకుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే అందరికి సుపరిచితుడిగా పేరు తెచ్చకున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలకు
కేంద్ర బిందువుగా నిలిచారు. ఆ నాయకుడి చరిష్మాతో దశాబ్ధాల కాలం పాటు రాజకీయంగా ఓ వెలుగు వెలుగుతూ వచ్చింది ఆయన ఫ్యామిలీ. అయితే ఇప్పుడు మాత్రం సీన్ రివర్సైంది. రాజకీయంగా నమ్ముకున్న పార్టీలో ఆ
ఫ్యామిలీకి ప్రాధాన్యత తగ్గింది. అందుకు వ్యక్తిగత కారణాలు కాకపోయినప్పటికి రాజకీయ పొత్తులు, పార్టీ అధిష్టానం నిర్ణయంలో మార్పుల ఫలితమే అంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన దివంగత నేత, టీడీపీ
నాయకుడు పరిటాల రవి(Paritala Ravi) ఫ్యామిలీ నిన్నటి వరకు జిల్లా రాజకీయాలను శాసించింది. కాని ఇప్పుడు మాత్రం ఆ ఫ్యామిలీ కోరిన సీట్లు ఇచ్చే పరిస్థితిలో తెలుగుదేశం(Telugudesam) పార్టీ లేదు.
పరిటాల ఫ్యామిలీ గ్రాఫ్ ఎందుకు తగ్గింది .. రాబోయే ఎన్నికల్లో పరిటాల కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రాధాన్యత దక్కనుంది అనేది ఇప్పుడు పరిటాల రవి అభిమానుల్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్న అంశం.
advertisement పరిటాల ఫ్యామిలీ చరిష్మ తగ్గిందా... ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో పరిటాల రవి పేరు తెలియని వారుండరు. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేతగానే కాకుండా ఫ్యాక్షన్ రాజకీయాలు, జిల్లాలో
అందరివాడిగా పేరు తెచ్చుకున్న పరిటాల రవి తన సొంత చరిష్మాతో రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇలాంటి బలమైన నాయకుడు మరణానంతరం ఆయన ఫ్యామిలీ నుంచి పరిటాల సునీతకు
రాజకీయంగా టీడీపీలో సముచిత స్థానం దక్కింది. మంత్రిగా కూడా కొనసాగారు. ఆ తర్వాత పరిటాల వారసుడిగా ఆయన కుమారుడు పరిటాల శ్రీరాం ఎంట్రీతో జిల్లాలో పరిటాల ఫ్యామిలీ ఇంత కాలం చక్రం తిప్పుతూ వచ్చింది.
అయితే ఇప్పుడు మాత్రం జిల్లాలోనే కాదు ..తెలుగుదేశం పార్టీలో కూడా పరిటాల ఫ్యామిలీకి ఆ పరిస్థితి లేదు. advertisement రెండు సీట్లు కోరుతున్న పరిటాల ఫ్యామిలీ .. గత ఎన్నికల్లో అనంతపురం జిల్లా
రాప్తాడు నియోజకవర్గం నుండి పోటీ చేసిన పరిటాల శ్రీరామ్ తన ప్రత్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అదే సమయంలో ధర్మవరం నుంచి పోటీ చేసిన వరదాపురం సూరి ఓడిపోవడంతో తెలుగుదేశం
పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. దీంతో ధర్మవరంలో టీడీపీకి అభ్యర్థి కరువయ్యారు. అప్పటినుంచి ధర్మవరం బాధ్యతలు పరిటాల శ్రీరామ్ చూసుకుంటున్నారు. అయితే రానున్న ఎలక్షన్లలో తనకు రాప్తాడు
నియోజకవర్గం నుంచి తన కుమారుడు శ్రీరాం ధర్మవరం నుంచి తనకు టికెట్లు కేటాయించాలని పరిటాల సునీత చంద్రబాబు నాయుడుని కోరారు. అయితే ఒక కుటుంబం నుంచి ఒకరికి సీటు అనే నిదానంతో ముందుకు సాగుతున్న బాబు
పరిటాల కుటుంబానికి ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం మీద స్పష్టతనివ్వలేదని సమాచారం. advertisement ఒక్క టికెట్ మాత్రమే కన్ఫామా ... పరిటాల కుటుంబానికి రెండు సీట్లు ఇస్తే మిగతా ప్రాంతాల నుంచి
కూడా అదే రకమైన డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. కోరి కొరివితో తల గోక్కోవడం ఎందుకని చంద్రబాబు ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే గత ఐదేళ్లుగా రెండు నియోజకవర్గాల్లో పార్టీ
కార్యక్రమాలను నిర్వహిస్తూ 2 నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకున్న పరిటాల కుటుంబం ధర్మవరం, రాప్తాడు రెండు నియోజకవర్గాలు తమకే కావాలని పట్టుబడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 2
నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టగలగే ఆర్థిక స్తోమత పరిటాల కుటుంబానికి లేదనే భావనలో లో చంద్రబాబు నాయుడు ఉన్నారనేది పార్టీ ప్రముఖుల వాదనగా ఉంది. ఏది ఏమైనప్పటికీ అనంతపురం జిల్లా రాజకీయాల సాధించిన
పరిటాల రవి కుటుంబానికి నేటి పరిస్థితుల్లో తమ సీటు ఏదో కూడా తమ తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడటం పరిటాల అభిమానులను కలచివేస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. Location :
Anantapur,Anantapur,Andhra Pradesh First Published : February 10, 2024 6:16 PM IST Read More