Russia drone attacks: ఉక్రెయిన్‌పైకి వందలాది డ్రోన్లు.. రష్యా అతిపెద్ద దాడులు

feature-image

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్: ఉక్రెయిన్‌పై రష్యా (Ukraine Russia Conflict) మరోసారి విరుచుకుపడింది. రాత్రికి రాత్రే ఏకంగా వందలాది డ్రోన్లను ప్రయోగించింది. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలు మాస్కో జరిపిన


అతిపెద్ద డ్రోన్‌ దాడుల్లో (Drone Attack) ఇది ఒకటని ఉక్రెయిన్‌ వర్గాల సమాచారం. యుద్ధం ముగింపు విషయంలో ఇస్తాంబుల్‌ వేదికగా ఇరుదేశాల ప్రతినిధుల మధ్య ముఖాముఖి శాంతి చర్చలు జరిగిన రోజుల


వ్యవధిలోనే ఈ భారీ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం. ‘‘కీవ్‌, నిప్రోపెట్రోవ్స్క్‌, దొనెట్స్క్‌ తదితర ప్రాంతాలే లక్ష్యంగా రష్యా దాడులకు తెగబడింది. 273 ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. వాటిలో 88


డ్రోన్లను కూల్చివేశాం’’ అని ఉక్రెయిన్‌ వైమానికదళం తెలిపింది. సంఖ్యాపరంగా ఇదే అతిపెద్ద డ్రోన్‌ దాడిగా తెలుస్తోంది. గతంలో మాస్కో ఓసారి 267 డ్రోన్లు ప్రయోగించింది. తాజా దాడుల్లో కీవ్‌


ప్రాంతంలో ఓ మహిళ మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయని చెప్పారు. కీవ్‌ ప్రయోగించిన డ్రోన్లనూ కూల్చివేసినట్లు అటు రష్యా రక్షణశాఖ ప్రకటించింది. * ప్లాన్డ్‌..


ట్రెయిన్డ్‌.. ఎగ్జిక్యూటెడ్‌.. ఆపరేషన్‌ సిందూర్‌పై ఆర్మీ వీడియో యుద్ధానికి కారణమైన అంశాలకు ముగింపు పలకడం, శాశ్వత శాంతి కోసం పరిస్థితులను సృష్టించడం, దేశ భద్రతకు హామీ వంటివి తమ లక్ష్యాలని


రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదివారం స్పష్టం చేశారు. కీవ్‌కు నాటో సభ్యత్వం ఇవ్వకపోవడం, క్రిమియా, మరో నాలుగు ప్రావిన్స్‌లు తమకు చెందుతాయని అంగీకరించడం వంటివి నెరవేర్చాలని మాస్కో మొదటినుంచి


డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు.. రక్తపాతం ఆపడమే తన ఎజెండా అని, ఈ విషయమై పుతిన్‌తో మాట్లాడతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.