Harvard: మానవ శరీర భాగాలు బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయం.. ‘హార్వర్డ్‌’ మాజీ ఉద్యోగి నిర్వాకం

feature-image

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: హార్వర్డ్‌ యూనివర్సిటీ వైద్య విభాగానికి (Harvard Medical School)  దానంగా ఇచ్చిన మృతదేహాల నుంచి శరీర భాగాలను మాయం చేసిన కేసులో విశ్వవిద్యాలయానికి చెందిన మాజీ ఉద్యోగిని


పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ మార్చురీలో మాజీ మేనేజర్‌గా విధులు నిర్వహించిన 57 ఏళ్ల సెడ్రిక్ లాడ్జ్ అనే వ్యక్తి వ్యక్తి మృతదేహాల నుంచి అవయవాలను వేరు చేసి బ్లాక్


మార్కెట్‌లో అమ్మినట్లు అధికారులు పేర్కొన్నారు. పీపుల్ మ్యాగజైన్ చేసిన ఆరోపణల ప్రకారం.. హార్వర్డ్ మెడికల్ స్కూల్ మార్చురీలో మాజీ మేనేజర్‌గా విధులు నిర్వహించిన 57 ఏళ్ల సెడ్రిక్ లాడ్జ్‌కు


పెన్సిల్వేనియాలోని ఒక వ్యక్తి మూడేళ్లలో దాదాపు 37,355.16 డాలర్లను ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. చెల్లింపుల సమయంలో ‘‘హెడ్ నంబర్ 7’’ వంటి అనుమానాస్పద పదాలు ఉన్నట్లు గుర్తించారు. మసాచుసెట్స్‌లోని


ఒక మహిళకు మానవ చర్మాన్ని సరఫరా చేసినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో గతేడాది పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.  తాజాగా పెన్సిల్వేనియాలోని ఒక ఫెడరల్ కోర్టులో విచారణ సందర్భంగా అతడు


నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. 2018- 2020 మధ్య వైద్య పరిశోధన కోసం హార్వర్డ్ అనాటమికల్ గిఫ్ట్ ప్రోగ్రామ్‌కు విరాళంగా ఇచ్చిన మార్చురీలోని శవాల నుంచి శరీర భాగాలను దొంగలించి..


వాటిని డార్క్‌ వెబ్‌సైట్లలో అంతర్రాష్ట్ర రవాణా చేసినట్లు సెడ్రిక్ లాడ్జ్‌ తెలిపాడు. బోస్టన్‌లోని హార్వర్డ్‌ మార్చురీ నుంచి దొంగలించిన శరీర భాగాలను సెడ్రిక్ లాడ్జ్ న్యూ హాంప్‌షైర్‌లోని తన


ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచేవాడినని.. అనంతరం వాటిని తన భార్య సహకారంతో రాష్ట్రాల సరిహద్దుల మీదుగా బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించేవాడినని వెల్లడించాడు. ఒక్కోసారి కొనుగోలుదారులు నేరుగా అతడి


నివాసానికి వచ్చి అవయవాలను తీసుకెళ్లేవారని చెప్పాడు. వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడాలని సేవాభావంతో దానం చేసిన మృతదేహాల అవయవాలను అక్రమ రవాణా చేసినందుకు అతడికి పదేళ్ల జైలు శిక్ష, జరిమానా


విధించే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతరులపైనా కేసు నమోదు చేశారు. ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్ మసాచుసెట్స్, న్యూహాంప్‌షైర్, పెన్సిల్వేనియా వంటి ప్రాంతాల్లో


విస్తరించి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.