
Play all audios:
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విశ్రాంత ఐపీఎస్ అధికారి టి.ప్రభాకర్రావు ఈ నెల 5న సిట్ విచారణకు హాజరవుతారని సమాచారం. హైదరాబాద్: ఫోన్
ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విశ్రాంత ఐపీఎస్ అధికారి టి.ప్రభాకర్రావు ఈ నెల 5న సిట్ విచారణకు హాజరవుతారని సమాచారం. ఆయన 14 నెలలుగా అమెరికాలోనే
ఉన్నారు. ఇటీవల భారత్కు తిరిగిరావాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఆదేశాలతో.. తిరిగి రానున్నారు. విచారణకు హాజరవుతానని సిట్కు ప్రభాకర్రావు తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు విచారణకు
సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ లేఖ ఇచ్చారు. వన్ టైం ఎంట్రీ పాస్పోర్టు అందిన వెంటనే భారత్కు రానున్నారు. పాస్పోర్టు అందిన మూడు రోజుల్లో రావాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం
ఆయన్ను ఆదేశించింది. ప్రభాకర్రావును విచారిస్తే కేసు కొలిక్కి రావొచ్చని దర్యాప్తు బృందం భావిస్తోంది. (Telangana News)