
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) ఫైనల్లో ఆర్సీబీతో తలపడే జట్టేదో నేడు తేలనుంది. అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్లో ముంబయి, పంజాబ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మంగళవారం
బెంగళూరుతో ఫైనల్ ఆడనుంది. పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు చిన్నపాటి వర్షం మొదలైంది. ప్రస్తుతం పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. ఒక వేళ క్వాలిఫయర్
2 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. అప్పుడు పంజాబ్ జట్టుకే లాభం. ఎందుకంటే పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న జట్టే ముందుకు వెళ్తుంది. టాప్ 4 రేసును పంజాబ్ మొదటి స్థానంతో.. ముంబయి నాలుగో
స్థానంతో ముగించిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్ నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. అప్పుడు ముంబయి నిష్క్రమిస్తుంది. ఇక ప్లే ఆఫ్స్లోకి దూసుకొచ్చిన పంజాబ్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ఆర్సీబీ
చేతిలో చతికిలబడింది. ఓ వైపు బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. మరోవైపు మార్కో యన్సెన్, చాహల్ లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది. మరి నేటి మ్యాచ్లో ముంబయిని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహాలతో
జట్టు వస్తుందో చూడాలి. ఇక గుజరాత్ను ఓడించి జోరు మీదున్న ముంబయి ఈ మ్యాచ్లో కాస్త ఫేవరేట్గా కనిపిస్తోంది. అయితే.. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.