Ipl 2025: వీరి ఆటతీరే కాదు.. మాటతీరూ అదుర్స్‌

feature-image

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ 2025 సీజన్‌ ముగిసింది. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత 18వ సీజన్‌లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. అయితే ఈ ఐపీఎల్‌ మెగా టోర్నీలో పలువురు ఆటగాళ్లు తమ ఆట తీరుతోనే కాకుండా.. మాట


తీరుతోనూ ఆకట్టుకున్నారు. తాము స్ఫూర్తి పొందుతూ.. ఇతరుల్లోనూ ప్రేరణ కలిగించే ప్రయత్నం చేశారు. వాటిలో కొన్ని వ్యాఖ్యల మీద ఓ లుక్కేద్దామా! ఒకప్పుడు కష్టం.. ఇప్పుడు సులభం! ‘నేను గత మూడు, నాలుగు


సంవత్సరాలుగా సన్నద్ధమవుతున్నాను. దాని ఫలితాలను కూడా చూశా. ఒకప్పుడు కష్టంగా అనిపించిన విషయాలన్నీ ఇప్పుడు సులభంగా మారాయి. దృష్టి కేంద్రీకరించడం ముఖ్యమని నేను గ్రహించాను. జట్టుకు అవసరమైన మేరకు


మాత్రమే ఆడాలి. ఈ స్థాయిలో అవసరం లేని పనులు చేయడానికి అస్సలు ప్రయత్నించకూడదు’ అని టీనేజ్‌ థండర్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ తాను ఐపీఎల్‌లో గుజరాత్‌


టైటాన్స్‌ (Gujarat Titans) మీద 35 బంతుల్లోనే సెంచరీ చేసిన అనంతరం అన్నాడు.  వర్తమానంలో ఉంటాను! ‘ఫైనల్‌లో ఆర్సీబీ లాంటి జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పుడు సహజంగానే ఎన్నో అంచనాలుంటాయి. కానీ,


నేను ఎల్లప్పుడూ నా నియంత్రణలో ఉన్న వాటిపైనే దృష్టి సారిస్తాను. వర్తమానంలో ఉండటానికి ప్రయత్నిస్తాను. ఈ కెప్టెన్సీ ప్రయాణం నాకు గొప్ప అనుభవం. కొంతమంది అత్యుత్తమ కెప్టెన్‌లు, విదేశీ ఆటగాళ్లతో


కలిసి ఆడటం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ప్రశాంతమైన, సురక్షితమైన జట్టు వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టిసారించాను. మా జట్టులో దేశవాళీ ప్లేయర్స్‌తోపాటు అంతర్జాతీయ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో


ఉంటారు’ అని ఆర్సీబీ (Royal Challengers Bengaluru) కెప్టెన్‌ రజత్‌ పటీదార్ ఐపీఎల్‌ ఫైనల్‌కు ముందు అన్నాడు. పసిపాపలా నిద్ర పోతాను! ‘ఆర్సీబీ జట్టుకు నా యవ్వనం, శక్తి, ఉత్సాహం, అనుభవం ఇచ్చా.


ప్రతి సీజన్‌లో గెలవడానికి ప్రయత్నించా. ఈరోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. గెలిచిన తర్వాత భావోద్వేగంలో మునిగిపోయాను. ఇది చాలా ఇంటెన్సిటీ ఉన్న టోర్నమెంట్. ఇక ఈ రాత్రి, నేను పసిపిల్లాడిలా


హాయిగా నిద్రపోతాను’ అని విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్‌ టోర్నీ గెలిచిన అనంతరం అన్నాడు.  మానసికంగా మెరుగయ్యా ‘బ్యాటర్‌గా నాలో పెద్దగా మార్పు రాలేదని నేను అనుకుంటున్నాను. కానీ మానసికంగా


నేను మెరుగుపడ్డాను. దిగ్గజ ఆటగాళ్లతో పోటీ పడటం ఎప్పుడూ గొప్పగా అనిపిస్తుంది. దీన్ని నేను ఆస్వాదిస్తున్నా. కానీ జట్టుకు ఉత్తమ సేవలు అందించడమే నా ప్రథమ ప్రాధాన్యం’ అని ఈ ఐపీఎల్‌ సీజన్‌లో


అత్యధిక పరుగులు చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans) బ్యాటర్ సాయిసుదర్శన్‌ అన్నాడు. క్రికెట్‌ చాలా త్యాగాలను కోరుకుంటుంది ‘నా ఆట, ఆలోచనలు, సామర్థ్యాలపై నాకు చాలా నమ్మకం ఉంది. అంతిమంగా,


నా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడం నా బాధ్యత. నేను ఎంత కష్టపడి పనిచేయాలో నాకు తెలుసు. క్రికెట్ చాలా త్యాగాలను కోరుతుంది. కానీ మీరు ఏదైనా సాధించినప్పుడు లేదా బాగా రాణించినప్పుడు మాత్రమే ప్రజలు


వాటిని గమనిస్తారు. నాకు, నేను విజయం సాధించాలనుకుంటే, నేను ప్రతి అంశంలోనూ కష్టపడి పనిచేయాలి. మీరు పగలు, రాత్రి అలుపెరగకుండా ప్రయత్నం చేసినప్పుడు ఫలితాలు వస్తాయి. నా మీద నేను నమ్మకం ఉంచుకోవడం


పైనే ఎప్పుడూ నా దృష్టిని పెడతాను’ అని రాజస్థాన్‌ రాయల్స్‌ యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) అన్నాడు.