
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్ ఇచ్చింది. లఖ్నవూ వేదికగా
జరిగిన మ్యాచ్లో బెంగళూరుపై హైదరాబాద్ 42 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 231/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 189 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమితో
ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. పంజాబ్ కింగ్స్ రెండో స్థానానికి చేరుకుంది. పాయింట్ల పరంగా (17) ఇరు జట్లూ సమంగా నిలిచినా.. నెట్రన్రేట్లో మాత్రం పంజాబ్ (+0.389) కంటే
ఆర్సీబీ (+0.255) వెనుకబడింది. పంజాబ్ ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉండగా.. బెంగళూరుకు ఒకటే మిగిలి ఉంది. ఆర్సీబీ ఓపెనింగ్ మినహా... సన్రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 232 పరుగుల భారీ లక్ష్య
ఛేదనను బెంగళూరు అద్భుతంగా ప్రారంభించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (62), విరాట్ కోహ్లీ (43) దూకుడుగా ఆడారు. తొలి వికెట్కు ఏడు ఓవర్లలోపే 80 పరుగులు జోడించారు. కోహ్లీ ఔటైనప్పటికీ సాల్ట్ మాత్రం
వేగంగా ఆడటంతో బెంగళూరు విజయం దిశగానే సాగింది. కానీ, మయాంక్ అగర్వాల్ (11), రజత్ పటీదార్ (18) దూకుడు ప్రదర్శించలేకపోయారు. స్వల్ప వ్యవధిలో సాల్ట్, మయాంక్ వికెట్లను హైదరాబాద్ బౌలర్లు
పడగొట్టారు. అయితే, రజత్తో కలిసి జితేశ్ శర్మ (24) ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 25 బంతుల్లోనే 44 పరుగులు రాబట్టారు. ఎప్పుడైతే రజత్ రనౌట్ రూపంలో
ఔటయ్యాడో.. బెంగళూరు బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. డెత్లో హైదరాబాద్ బౌలర్లు భళా.. అప్పటి వరకు భారీగా పరుగులు ఇచ్చిన సన్రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. డెత్ ఓవర్లలో (16
నుంచి 20) కేవలం 22 పరుగులే మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టారు. భారీ హిట్టర్లు రొమారియో షెఫర్డ్ (0), టిమ్ డేవిడ్ (1) విఫలం కావడం బెంగళూరును దెబ్బతీసింది. కృనాల్ పాండ్య (8), భువనేశ్వర్
(3), యశ్ దయాల్ (3) త్వరగానే పెవిలియన్కు చేరారు. హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ 3, ఇషాన్ మలింగ 2.. జయ్దేవ్, హర్షల్ పటేల్, హర్ష్ దూబె, నితీశ్ తలో వికెట్ తీశారు. ఇషాన్ సూపర్
ఇన్నింగ్స్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్కు శుభారంభమే వచ్చింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (34), ట్రావిస్ హెడ్ (17) తొలి వికెట్కు 4 ఓవర్లలోనే 54 పరుగులు జోడించారు. కానీ,
ఓపెనర్లిద్దరూ వెనువెంటనే ఔటైనా సరే హైదరాబాద్ స్కోరు బోర్డు వేగం మాత్రం ఆగలేదు. దానికి కారణం ఇషాన్ కిషన్ (94*: 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లు). ఐదో ఓవర్లో క్రీజ్లోకి అడుగు పెట్టిన అతడు
చివరి వరకూ ఉండి అజేయంగా నిలిచాడు. తొలి మ్యాచ్లో సెంచరీ చేసిన తర్వాత అతడి నుంచి మరో సూపర్ ఇన్నింగ్స్ రావడం ఇదే కావడం గమనార్హం. హెన్రిచ్ క్లాసెన్ (24), అనికేత్ వర్మ (26)తో కలిసి విలువైన
భాగస్వామ్యాలు నిర్మించాడు. నితీశ్ కుమార్ రెడ్డి (4), అభివన్ మనోహర్ (12) రాణించలేదు. పాట్ కమిన్స్ (13*)తో కలిసి ఇషాన్ కిషన్ ఏడో వికెట్కు మూడు ఓవర్లలోనే 43 పరుగులు రాబట్టాడు. బెంగళూరు
బౌలర్లు రొమారియో షెఫర్డ్ 2... భువనేశ్వర్, లుంగి ఎంగిడి, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్య తలో వికెట్ తీశారు.