
Play all audios:
‘కన్నప్ప’ హార్డ్డిస్క్ ఇంకా తన చేతికి రాలేదని మంచు విష్ణు తెలిపారు. పోలీసుల విచారణలో నిజానిజాలు తెలుస్తాయని అన్నారు. ఇంటర్నెట్ డెస్క్: ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం హార్డ్డిస్క్ మాయంపై
కథానాయకుడు మంచు విష్ణు (Manchu Vishnu) మరోసారి స్పందించారు. ఇంకా అది తన చేతికి రాలేదని తెలిపారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో తాజాగా ఓ
ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు దీని గురించి మాట్లాడారు. ఇంత గొప్ప సినిమా పూర్తి చేశానంటే అది శివలీల అని అన్నారు. ‘‘ముంబయిలో ఉన్న 8 కంపెనీలు ‘కన్నప్ప’ వీఎఫ్ఎక్స్ పనులు చేస్తున్నాయి. వాటిలో
ఒక కంపెనీ ఇక్కడ ఉన్న దానికి ఆన్లైన్లో కొంతభాగం పంపింది. అది క్లారిటీగా రాలేదు. దీంతో రెండోసారి అప్లోడ్ చేసి పంపింది. ముందుజాగ్రత్త కోసం వాళ్లు ఒక హార్డ్డిస్క్ కూడా పంపారు. నాన్నగారి
ముగ్గురి పిల్లలకు సంబంధించి ఏ పార్సిల్ వచ్చినా ఆ ఇంటికే వస్తుంది. అక్కడ ఉండే మేనేజర్లు వచ్చిన పేరు బట్టి, ఎవరిది వాళ్లకు అందజేస్తారు. మా కంపెనీ జీఎస్టీ రిజిస్టర్ అడ్రస్ కూడా నాన్నగారి
ఇంటిదే ఉంటుంది. అక్కడికి ‘కన్నప్ప’ పార్సిల్ వచ్చినప్పుడు రఘు అనే వ్యక్తి చరిత అనే ఆవిడకు దాన్ని తీసుకోమని చెప్పారట. ఆవిడ దాన్ని తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే..
వీళ్లిద్దరూ మనోజ్తో ఉంటారట. అక్కడ పని చేస్తారో.. లేదో మాకు తెలియదు. ఆయనతో ఉంటారని మాత్రం తెలిసింది. హార్డ్డిస్క్ కూడా అక్కడే ఉందని తెలిసింది. పోలీసు కంప్లైంట్ ఇచ్చాం. అప్పటికీ
మధ్యవర్తితో చెప్పి పంపాము. అయినా ఇవ్వమన్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించాం. పోలీసులకు మొత్తం వివరించాం. వాళ్లకు అంతా తెలుసు. వాళ్లు విచారణ చేసి పూర్తి వివరాలు చెబుతారు. ఇప్పటివరకూ ఇంకా
హార్డ్డిస్క్ నా చేతికి రాలేదు. పాస్వర్డ్ ఉంది కాబట్టి సేఫ్ అనుకుంటున్నా. కానీ, ఏ పాస్వర్డ్ అయినా.. 99శాతం మాత్రమే సేఫ్. 100 శాతం సేఫ్ కాదు’’ అని తెలిపారు. * కాల పరీక్షలో నెగ్గిన
కల్ట్ క్లాసిక్.. ‘నాయగన్’.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? రూ.15 కోట్లు వృథా.. కాస్ట్లీ మిస్టేక్.. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కిందని మంచు విష్ణు చెప్పారు. ఆ బడ్జెట్ మొత్తం
ఆన్స్క్రీన్ మీద కనిపిస్తుందని తెలిపారు. ఎంత ఖర్చు పెట్టామనేది ఇప్పుడు వెల్లడించనని అన్నారు. ‘‘వీఎఫ్ఎక్స్కు ఇంత ఖర్చు అయి ఉండకూడదు. కానీ, దానికి చాలా బడ్జెట్ అయింది. ఒక చిన్న తప్పు వల్ల
సుమారు రూ.15 కోట్లు వృథా అయింది. కాస్ల్టీ మిస్టేక్ చేశాం’’ అని తెలిపారు.