
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: తనపై రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని అలీ (Ali) అభిప్రాయపడ్డారు. ఆయన మాట తూలిందని పేర్కొన్నారు. సంబంధిత వీడియోలను ప్రోత్సహించొద్దని
విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో అలీపై రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంపై అలీ స్పందించారు. ‘‘రాజేంద్ర ప్రసాద్ మంచి ఆర్టిస్ట్. ఆయన తన
కుమార్తెను కోల్పోయిన విషయం మనకు తెలుసు. పుట్టెడు దుఃఖంలో ఉన్నారు’’ అని అన్నారు.దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో ఆయన సినిమాల్లో నటించిన నటీనటులు పాల్గొన్నారు. అలీ, ఓ నటిపై
రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. తన కామెంట్స్పై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. సోమవారం నిర్వహించిన.. తన కొత్త సినిమా ‘షష్టిపూర్తి’ సక్సెస్
మీట్లో మాట్లాడారు. తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, తానెప్పుడూ ఇతరులతో సరదాగా ఉంటానని అన్నారు.