
Play all audios:
ఇంటర్నెట్డెస్క్: ఆపరేషన్ సిందూర్ (operation sindoor) సమయంలో అభ్యంతరకర పోస్టు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్, న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్కతా పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
ప్రస్తుతం ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే
టీఎంసీ ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ (west bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సనాతన ధర్మంపై మాట్లాడిన వీడియోను పవన్ ఎక్స్లో పోస్టు చేశారు.
‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ ఒక వీడియో పోస్టు చేసింది. తన మాటలు కొంత మందికి బాధ కలిగించేవిగా ఉన్నాయని గ్రహించిన ఆమె.. దాన్ని తొలగించి, క్షమాపణలు కూడా చెప్పింది.
పశ్చిమ బెంగాల్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి ఆమెపై చర్యలు తీసుకున్నారు. కానీ, సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ కోట్లాది మంది బాధకు కారణమైన అక్కడి నాయకులు, టీఎంసీ ఎంపీల సంగతి ఏంటి? వారి
వ్యాఖ్యలకు క్షమాపణలు ఎక్కడ?వారిని ఎందుకు అరెస్టు చేయలేదు? దైవదూషణను ఎప్పుడూ ఖండించాలి. లౌకికవాదం రెండు వైపులా ఉండాలి. ఇది కొందరికి కవచం.. మరికొందరికి ఖడ్గం కాకూడదు. పశ్చిమ బెంగాల్ పోలీసులు
అందరిపట్ల ఒకేలా వ్యవహరించాలి’’ అని పవన్ రాసుకొచ్చారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్పై స్పందించని బాలీవుడ్ నటులను ఉద్దేశిస్తూ
శర్మిష్ఠ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో పోస్టు చేసింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో వెంటనే తొలగించి క్షమాపణలు కోరింది. ఈక్రమంలోనే ఆమెపై పలు ఫిర్యాదులు నమోదు కావడంతో పోలీసులు అరెస్టు
చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.