Justice as oka: తల్లి మరణించిన మరుసటి రోజే విధుల్లోకి.. ఒకేరోజు 11 తీర్పులు

feature-image

Play all audios:

Loading...

ముందురోజు (మే 22న) తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్న జస్టిస్‌ ఓకా.. మరుసటి రోజే విధుల్లో చేరి పనిపట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎస్‌


ఓకా (Justice AS Oka)కు ఆఖరి పనిదినం నాడు 11 తీర్పులు వెలువరించారు. అంతేకాదు, ముందురోజు (మే 22న) తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్న జస్టిస్‌ ఓకా.. మరుసటి రోజే విధుల్లో చేరి పనిపట్ల తన నిబద్ధతను


చాటుకున్నారు. సుప్రీం కోర్టు (Supreme Court) న్యాయమూర్తిగా మే 24న పదవీ విరమణ చేయనున్న ఆయన.. చివరి పనిదినం రోజు న్యాయమూర్తులు విధులు నిర్వర్తించకపోవడాన్ని తాను అంగీకరించనని ఇటీవల


అభిప్రాయపడ్డారు. ఆరోజు మధ్యాహ్నం వరకు కాకుండా పూర్తి సమయం వరకు పనిచేయాలన్నారు. జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా 1960 మే 25న జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్‌ బాంబే నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొందిన


ఆయన.. 1983లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. తండ్రి శ్రీనివాస్‌ డబ్ల్యూ ఓకా వద్ద ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. అనంతరం వీపీ టిప్‌నిస్‌ వద్ద పనిచేసిన ఆయన.. 2003లో బాంబే హైకోర్టు అదనపు


న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం 2005, నవంబర్‌ 12న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. * హత్యకేసులో 43 ఏళ్లు జైల్లోనే.. నిర్దోషిగా విడుదలైన 104 ఏళ్ల వృద్ధుడు! కర్ణాటక హైకోర్టు ప్రధాన


న్యాయమూర్తిగా 2019 మే 10న బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ ఏఎస్‌ ఓకా... 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అప్పటినుంచి వివిధ ధర్మాసనాల్లో మొత్తంగా 295 తీర్పులు ఇవ్వగా..


వివిధ ధర్మాసనాల్లో వెయ్యి తీర్పుల్లో భాగస్వామ్యం పంచుకున్నారు. బెయిల్‌ దరఖాస్తులను ట్రయల్‌ కోర్టులు తిరస్కరించడంపై పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేసిన జస్టిస్‌ ఓకా.. కొవిడ్‌ సమయంలోనూ వలస


కార్మికుల హక్కుల రక్షణకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం వారిపై అనుసరించిన వైఖరిని ప్రశ్నించారు.