
Play all audios:
వచ్చే పార్లమెంటు (Parliament) సమావేశాల్లో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ డెస్క్: వచ్చే పార్లమెంటు (Parliament) సమావేశాల్లో
జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు గాను అన్ని ప్రధాన రాజకీయ పక్షాల నేతలతో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి
కిరణ్ రిజిజు సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జస్టిస్ వర్మ ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో దిల్లీలోని జస్టిస్
యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. ఈ ఘటనలో భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. ఈ ఘటన అనంతరం మార్చి 28న సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ యశ్వంత్
వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసి.. ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని సూచించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించింది. ఇది
నిజమేనని ధ్రువీకరించిన త్రిసభ్య కమిటీ సంబంధిత నివేదికను సుప్రీంకోర్టుకు అందించింది. ఈ క్రమంలోనే చర్యలకు ఉపక్రమించిన కేంద్రం.. అభిశంసనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.