Andhra pradesh news: ఫైళ్ల దహనం కేసులో విచారణ వేగవంతం.. మాధవరెడ్డిని ప్రశ్నిస్తున్న పోలీసులు

feature-image

Play all audios:

Loading...

మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసులో విచారణను వేగవంతం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి: మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో ఫైళ్ల 


దహనం కేసులో విచారణను వేగవంతం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి సీఐడీ కార్యాలయంలో ఈ విచారణ సాగుతోంది. ఆయన్ను సాయంత్రం పోలీసులు


చిత్తూరు కోర్టులో హాజరుపరచనున్నారు.  అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో వంకరెడ్డి మాధవరెడ్డిని గురువారం సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఘటనలో ప్రధాన


కుట్రదారుగా ఆయనపై సీఐడీ అభియోగాలు మోపింది. మాధవరెడ్డి నెల రోజులుగా పరారీలో ఉన్నారు. పట్టుకునేందుకు మదనపల్లెలో ఆయన నివాసం వద్ద సీఐడీ అధికారులు నిఘా పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు


చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు వద్ద తన ఫాంహౌస్‌లో ఉన్నారనే సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. (Andhra Pradesh News)