
Play all audios:
Donald Trump: అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే చాలారకాల వస్తువులపై భారత్ జీరో టారిఫ్లను ఆఫర్ చేసిందని ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. Donald Trump | ఇంటర్నెట్ డెస్క్: జీరో టారిఫ్ల
విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే చాలారకాల వస్తువులపై భారత్ జీరో టారిఫ్లను ఆఫర్ చేసిందని మరోసారి పునరుద్ఘాటించారు.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్ నుంచి పదేపదే ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ను
లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి అని మరోమారు వ్యాఖ్యానించారు. తమ దేశం నుంచి దిగుమతి చేసేకొనే వస్తువులపై సుంకాల్ని 100 శాతం తగ్గించడానికి
భారత్ అంగీకరించిందన్నారు. ఇక భారత్తో వాణిజ్య ఒప్పందం గురించి తొందరలేదని.. తమతో ఒప్పందం కుదుర్చుకొనేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. * బాయ్కాట్ తుర్కియే.. అజియో, మింత్రాలో ఆ
బ్రాండ్ల విక్రయాలు బంద్ ఇదిలాఉండగా ఇప్పటికే ట్రంప్ వ్యాఖ్యలపై జైశంకర్ స్పందించారు. ‘‘రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అవి సంక్లిష్ట చర్చలు. ప్రతి అంశంపై నిర్ణయం తీసుకునేవరకు అవి
కొనసాగుతూనే ఉంటాయి. వాణిజ్య ఒప్పందం పరస్పరం ప్రయోజనకరంగా ఉండాలి. అది జరిగేవరకు దాని గురించి ప్రకటన చేయడం తొందరపాటే అవుతుంది’’ అని ట్రంప్ ప్రస్తావన లేకుండా మంత్రి మాట్లాడిన విషయం తెలిసిందే.