
Play all audios:
వైకాపా హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ (YS Jagan) కుట్ర చేస్తున్నారని తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విజయవాడ: వైకాపా హయాంలో
రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ (YS Jagan) కుట్ర చేస్తున్నారని తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విదేశీ కంపెనీలపై ఆయన అసత్యాలను ప్రచారం
చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పెట్టుబడులు పెట్టే ప్రవాసాంధ్రులపై జగన్ విషం చిమ్ముతున్నారు. వారికి మేం అండగా ఉంటాం.. నిర్భయంగా పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రవాసాంధ్రులపై నిరాధార
ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదు. రాజధాని అమరావతికి నిధులు రాకుండా జగన్ బ్యాచ్ ప్రయత్నిస్తోంది. రాష్ట్రానికి, నిరుద్యోగ యువతకు నష్టం చేసే పనులను మానుకోవాలి’’ అని కేశినేని చిన్ని
పేర్కొన్నారు.