Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత.. ఆ ప్రచారం ఫేక్‌

feature-image

Play all audios:

Loading...

శ్రీవారి మెట్టు మార్గంలో ఆదివారం ఉదయం చిరుత సంచరించిందనే వార్తలు అవాస్తవమని అటవీ శాఖ ఎఫ్ఆర్‌వో దొరైస్వామి తెలిపారు. తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో ఆదివారం ఉదయం చిరుత సంచరించిందనే వార్తలు


అవాస్తవమని అటవీ శాఖ ఎఫ్ఆర్‌వో దొరైస్వామి తెలిపారు. చిరుత సంచరించినట్లు జరిగిన ప్రచారం తప్పుడు సమాచారంగా తేల్చారు. ఈ మార్గంలో చిరుత రాలేదని స్పష్టం చేశారు. భక్తులు యథావిధిగా దర్శనాలకు


వెళ్తున్నట్లు తెలిపారు. మరోవైపు శనివారం సాయంత్రం సుమారు 5.30 గంటలకు శిలాతోరణం వద్ద చిరుత కనిపించిందని.. తరువాత అది అడవుల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. (Andhra Pradesh News)