
Play all audios:
ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న గాలి జనార్దనరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న గాలి జనార్దనరెడ్డి
(Gali Janardhan Reddy) నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంచల్గూడ జైలులో తనకు అదనపు సౌకర్యాలు కల్పించాలని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో
ఉంది. ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దనరెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. (Andhra Pradesh News)