Srisailam: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు... ఘనంగా దేవుళ్ల పెళ్లి

feature-image

Play all audios:

Loading...

Reported by: Published by: Last Updated:January 15, 2025 11:45 AM IST శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పార్వతీ, మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. X శ్రీశైల


మల్లన్న లీలా కళ్యాణం శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవారికి వస్త్రాలను చెంచు గిరిజనులు సమర్పించారు. ఐటీడీఏ పి.ఓ కె.వి శివప్రసాద్


ఇందులో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ పార్వతీ, మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి


కళ్యాణోత్సవం జరుగుతుంది. కేవలం మకర సంక్రాంతి రోజే శ్రీపార్వతీ, మల్లికార్జున స్వామివార్ల లీలా కళ్యాణోత్సవం జరిపించడం ఇక్కడి విశేషం. శ్రీశైల మహాక్షేత్రంలో నాలుగో రోజు మకర సంక్రాంతి


బ్రహ్మోత్సవాలలో భాగంగా పార్వతి మల్లికార్జునస్వామి దేవస్థానం తరుపున బ్రహ్మోత్సవ లీలాకళ్యాణం ఘనంగా నిర్వహించింది. ఈ కల్యాణానికి చెంచు గిరిజనులను ప్రత్యేకంగా ఆహ్వానించారు దేవస్థానం ఈవో


శ్రీనివాసరావు. స్వామి అమ్మవారి కల్యాణానికి వస్త్రాలు సమర్పించారు చెంచు గిరిజనులు. ఐటీడీఏ పిఓ. కెవి శివప్రసాద్ వెదురు బియ్యం, ఆకులతో అల్లిన బాసికలు, యజ్ఞోపవితం స్వామి అమ్మవారి బ్రహ్మోత్సవ


కళ్యాణానికి సమర్పించారు. చెంచు గిరిజనులు పార్వతిదేవిని తమ ఆడపడుచుగా భావించి ఆనవాయితీగా బ్రహ్మోత్సవ కల్యాణానికి వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఈ కల్యాణానికి విచ్చేసిన చెంచు గిరిజనులకు దేవస్థానం


తరుపున వస్త్రాలు అందజేశారు. advertisement ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పి.ఓ కెవి శివప్రసాద్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, చెంచు గిరిజనులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. Location :


Nandyal,Kurnool,Andhra Pradesh First Published : January 15, 2025 11:45 AM IST Read More