Jr ntr: జూనియర్ ఎన్టీఆర్ పై బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు..

feature-image

Play all audios:

Loading...

Published by: Last Updated:May 25, 2024 11:31 AM IST వల్లభనేని వంశీ, కొడాలి నాని మాట్లాడుతున్నారని ఈ అంశాన్ని లెవనెత్తాల్సిన అవసరం లేదన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీడీపీ బాధ్యతలు నారా


లోకేష్ కు అప్పగించాలన్నారు బుద్ధా వెంకన్న. టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీపై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, నారా లోకేశ్‌ని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని


అన్నారు. ఇది తన డిమాండ్ అని చెప్పారు. ఇవాళ అమరావతిలో ఆయన మాట్లాడుతూ… ఆ డిమాండ్ చేసే హక్కు తనకుందని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ 2014 , 2019 , 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేయలేదని మాజీ


ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని మాట్లాడుతున్నారని ఈ అంశాన్ని లెవనెత్తాల్సిన అవసరం లేదన్నారు. ఓ


ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీడీపీ బాధ్యతలు నారా లోకేష్ కు అప్పగించాలన్నారు.ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజే నారా లోకేశ్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని బుద్దా


వెంకన్న కోరారు. లోకేశ్‌ని టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తే మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందన్నారు బుద్ధా వెంకన్న. అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాగా పనిచేశారని బుద్దా వెంకన్న అన్నారు.


ఆయనకు మంత్రి వర్గంలో కీలక శాఖ కేటాయించాలని చంద్రబాబుని కోరుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడి ఆత్మకథలో తనకో పేజీ ఉంటుందన్నారు బుద్ధా వెంకన్న. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం


చేసిన రోజే నారా లోకేశ్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని బుద్దా వెంకన్న కోరారు. లోకేశ్‌ని టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తే మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందన్నారు బుద్ధా వెంకన్న. అచ్చెన్నాయుడు


రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాగా పనిచేశారని బుద్దా వెంకన్న అన్నారు. ఆయనకు మంత్రి వర్గంలో కీలక శాఖ కేటాయించాలని చంద్రబాబుని కోరుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడి ఆత్మకథలో తనకో పేజీ


ఉంటుందన్నారు బుద్ధా వెంకన్న. advertisement గతంలో టీడీపీ ఓడిపోయాక చాలామంది పార్టీని వదిలి పారిపోయినప్పటికీ తాను మాత్రం పార్టీతోనే నిలబడ్డానని చెప్పారు. పోరాటం చేయని వాళ్లు, బ్లాక్ మెయిలింగ్


చేసి టిక్కెట్లు తెచ్చుకున్నారని ఆయన ఆరోపించారు. మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏం చేసినా తప్పులేదని అన్నారు. రెడ్ బుక్‌లో పిన్నెల్లి పేరుందని బుద్ధా వెంకన్న ఆరోపించారు.


ఈ సారి తప్పకుండా కూటమి అధికారంలోకి రావటం తథ్యమన్నారు బుద్దా వెంకన్న. చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని.. చంద్రబాబు ఒక్కరే ఇప్పటి వరకు ఒంటి చేత్తో టీడీపీని  ఈదుతున్నారన్నారు.


ఇప్పుడు ఆయనకు లోకేష్ , బ్రహ్మణి , భువనేశ్వరి , ముగ్గురు తోడయ్యారన్నారు. టీడీపీని మళ్లీ టీడీపీ అధికారం లోకి వస్తుంది అంటే అందరి పాత్ర ఉందన్నారు. టీడీపీ కూటమి 130 స్థానాలకు పైగా కూటమి


గెలుస్తుందని జోస్యం చెప్పారు. Location : Hyderabad,Hyderabad,Telangana First Published : May 25, 2024 11:30 AM IST Read More