
Play all audios:
హైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు. తెల్లవారుజాము నుంచి హైడ్రా ఈ
కూల్చివేతలు చేపట్టింది. పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లపై హైడ్రా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడి రహదారులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినా
మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో స్పందించిన ఆయన స్వయంగా స్థలాలను పరిశీలించారు. ఈక్రమంలో ఆయన
ఆదేశాలతో గురువారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్లోని సర్వే నంబర్లు 1, 10, 11లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. (Telangana News)