
Play all audios:
ఇంటర్నెట్డెస్క్: భారత్ - పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు (India Pakistan Tensions) తారస్థాయికి చేరుతున్న క్రమంలో సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత
పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా డ్రోన్లపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష్ సంఘవి
తాజాగా ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరూ దీనిని పాటించాలని కోరారు. ‘‘రాష్ట్రంలో జరిగే ఏ వేడుకల్లోనైనా బాణసంచా, డ్రోన్లపై ఈ నెల 15 వరకు నిషేధం విధిస్తున్నాం. దయచేసి ఈ మార్గదర్శకాలను పాటించాలని,
ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం’’ అని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో జరిగిన సమావేశం అనంతరం ఆయన ఈ పోస్ట్ పెట్టారు. పహల్గాం
ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను మనదేశం ధ్వంసం చేసిన క్రమంలో సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, రాజస్థాన్, గుజరాత్,
పశ్చిమబెంగాల్ పటిష్ఠమైన జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా గుజరాత్ (Gujarat) ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ప్రధాని మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు (India
Pakistan Tensions) పెరుగుతున్న వేళ భద్రతా సన్నద్ధతపై ప్రధాని ఆరాతీసి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భద్రతాపరంగా సున్నిత ప్రాంతాలైన కచ్, బనస్కంతా, పటాన్, జామ్నగర్లో పౌరుల
భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి అడిగారు. పాకిస్థాన్తో పంజాబ్ 532 కి.మీ.; రాజస్థాన్ 1070 కి.మీ.; గుజరాత్ 506 కి.మీ.; బంగ్లాదేశ్తో పశ్చిమబెంగాల్ 2,217 కి.మీ.
సరిహద్దును పంచుకుంటున్నాయి.