Wealth report: భారత్‌లో ధనికులు @ 85 వేలు.. బిలియనీర్లు ఎంతమందంటే?

feature-image

Play all audios:

Loading...

Wealth Report | దిల్లీ: దేశంలో ధనికుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 10 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వారి సంఖ్య 2024లో 6 శాతం మేర పెరిగి 85,698కి చేరింది. ఒకప్పుడు సింగిల్‌ డిజిట్‌కే


పరిమితమైన బిలియనీర్ల సంఖ్య సైతం 191కి చేరిందని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ పేర్కొంది. ఈమేరకు ‘ది వెల్త్‌ రిపోర్ట్‌ 2025’ నివేదికను బుధవారం విడుదల చేసింది. గతేడాది ధనవంతుల


సంఖ్య 80,686గా ఉందని నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. 2028 నాటికి ఈ సంఖ్య 93,753కి చేరుకోవచ్చని అంచనా వేసింది. హెచ్‌ఎన్‌ఐ జనాభా పెరుగుదల దేశం దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న పెట్టుబడి


అవకాశాలు, వృద్ధి చెందుతున్న లగ్జరీ మార్కెట్‌ను ప్రతిబింబిస్తోందని నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. అమెరికాలో అత్యధికంగా


9,05,413 మంది ధనవంతులు ఉండగా.. 471,634 మంది ధనవంతులతో చైనా రెండో స్థానంలో ఉంది. 1,22,118 మంది ధనవంతులతో జపాన్‌ మనకంటే ముందు వరుసలో నిలిచింది. * 6500mAh బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో వివో కొత్త


ఫోన్‌ ఇక బిలియనీర్ల విషయానికొస్తే.. 1 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వారిని బిలియనీర్లుగా వ్యవహరిస్తారు. 2019 నాటికి భారత్‌లో వీరి సంఖ్య కేవలం 9 మాత్రమే. 2024 నాటికి 191కి చేరింది.


గడిచిన ఏడాదిలో కొత్తగా 26 మంది బిలియనీర్ల క్లబ్‌లో చేరారని నైట్‌ ఫ్రాంక్‌ తెలిపింది. భారత్‌లోని బిలియనీర్ల సంపద మొత్తం విలువ 950 బిలియన్‌ డాలర్లతో సమానమని నైట్‌ఫ్రాంక్‌ లెక్కగట్టింది.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల ర్యాంకుల్లో చూస్తే అమెరికా (5.7 ట్రిలియన్లు), మెయిన్‌ల్యాండ్‌ చైనా (1.34 ట్రిలియన్‌ డాలర్లు) తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది.